నాగర్ కర్నూల్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి జన్మదిన వేడుకలు వివాదాస్పదంగా మారాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ఎలెక్ట్రిక్ పోల్స్‌పై ఫైర్ క్రాకర్స్ అమర్చి కాల్చడం ద్వారా పబ్లిక్ ప్రాపర్టీకి నష్టం కలిగే విధంగా ప్రవర్తించిన ప్రవీణ్, వెంకటేష్, భాస్కర్ గౌడ్‌లపై మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
అదేవిధంగా జన్మదిన వేడుకల సందర్భంగా రోడ్డును బ్లాక్ చేసి ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం కలిగించిన విష్ణు, నరసింహ, శ్రీశైలం, భాస్కర్ గౌడ్, తిమ్మాజీపేట పాండు, ఇంద్రకల్ రమణ తదితరులపై కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం. ప్రజా ఆస్తులకు నష్టం కలిగించడం, ట్రాఫిక్‌కు ఆటంకం కల్పించడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పోలీసులు హెచ్చరించారు.
ఈ విషయాన్ని నాగర్ కర్నూల్ ఎస్ఐపీ కే. గోవర్ధన్ వెల్లడించారు.: మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో కేసు నమోదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *