అనంతరం మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధికి గతంలోనే నిధులు మంజూరు చేయడం జరిగిందని, భవిష్యత్తులో కూడా ఆలయ విస్తరణ మరియు సౌకర్యాల మెరుగుదలకు తన వంతు కృషి కొనసాగిస్తానని తెలిపారు. దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాకుండా గ్రామ ఐక్యతకు ప్రతీకలని పేర్కొన్నారు.
గ్రామ అభివృద్ధి కోసం రహదారులు, మౌలిక వసతులు, తాగునీరు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని అన్నారు.
ఈ పూజా కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, సర్పంచ్ తుకారాం రెడ్డి, స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం భక్తి వాతావరణంలో ఘనంగా జరిగి: శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే
