ఈరోజు సేవాలాల్ సంస్కృతి సమైక్య ఆధ్వర్యంలో కొల్లాపూర్ నియోజకవర్గంలో సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన విస్లావత్ లింగం నాయక్ (రాష్ట్ర ఆదివాసి కాంగ్రెస్ వైస్ చైర్మన్) ప్రసంగిస్తూ, గెలిచిన సర్పంచులు బాధ్యతాయుతంగా ప్రజలకు సేవ చేస్తూ గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
అలాగే గిరిజన జాతి సంస్కృతి, భాషను కాపాడుతూ ప్రజలు–అధికారులతో సమన్వయంతో గ్రామాభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో, జూపల్లి కృష్ణారావు సహకారంతో గిరిజన గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి, నాగర్‌కర్నూల్ జిల్లా ఆదివాసి కాంగ్రెస్ చైర్మన్ హనుమంతు నాయక్, S. గోపి నాయక్, కూరాకుల శ్రీనివాస్, కొల్లాపూర్ సీఐ మహేష్, ఎస్సై లింగ నాయక్, గిరిజన ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.: కొల్లాపూర్ నియోజకవర్గంలో సర్పంచ్‌లకు ఘన సన్మానం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *