కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి నూతన చైర్మన్, వైస్ చైర్మన్లను శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నాగర్కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు బచ్చు రామకృష్ణ కూడా నూతనంగా బాధ్యతలు చేపట్టిన నాయకులను అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పట్టణ అభివృద్ధికి చైర్మన్, వైస్ చైర్మన్ సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, పారిశుధ్యం, తాగునీరు, రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.నూతన చైర్మన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, పట్టణ ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రజల సహకారంతో కల్వకుర్తి మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.: కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు స్వీకారం
