మాన్యవర్ కాన్షిరాం 92వ జయంతి సందర్భంగా ఈ నెల 15న హైదరాబాద్‌లోని బడంగ్‌పేట్‌లో ‘హలో బహుజన్ ఛలో బడంగ్‌పేట్’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బీఎస్పీ నాయకులు తెలిపారు. బామ్‌సెఫ్ (BAMCEF), డీఎస్-4 (DS-4), బీఎస్పీ పార్టీ వ్యవస్థాపకుడు మాన్యవర్ కాన్షిరాం జయంతిని పురస్కరించుకుని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ నాయకత్వంలో ఈ సభ జరుగుతుందని నాగర్ కర్నూల్ జోనల్ ఇంచార్జ్ పృథ్వీరాజ్, జిల్లా ఇంచార్జ్ కళ్యాణ్, నాగర్ కర్నూల్ అసెంబ్లీ ఇంచార్జ్ శ్రీను, అసెంబ్లీ అధ్యక్షుడు మడుపు నాగేష్ తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతదేశ బహుజనుల రాజకీయ దిశను మార్చిన గొప్ప నాయకుడు మాన్యవర్ కాన్షిరాం అని కొనియాడారు. ఉత్తర్ ప్రదేశ్‌లో బీఎస్పీ పార్టీని బలోపేతం చేసి నాలుగు సార్లు అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు. బహుజన సమాజానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని తెలిపారు.

కాన్షిరాం జయంతి సభను విజయవంతం చేసేందుకు జిల్లాలోని బహుజనులు భారీగా తరలివచ్చి పాల్గొనాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.: ఛలో బడంగ్‌పేట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *