బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్యామ్ ప్రసాద్ లాల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణపై చర్చించారు.
జిల్లాలో గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో స్థానిక సంస్థలు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ సూచించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సమర్థవంతంగా చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
జిల్లా అధికారులు మరియు వివిధ శాఖల అధికారులు నూతన అదనపు కలెక్టర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వంలో జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతంగా కొనసాగేందుకు సమన్వయంతో పనిచేస్తామని అధికారులు తెలిపారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్కు చెందిన శ్యామ్ ప్రసాద్ లాల్ మహాత్మా జ్యోతిబా పూలే విద్యా సంస్థల జాయింట్ సెక్రెటరీగా కూడా పనిచేశారు.: అదనపు కలెక్టర్గా జీ.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ బాధ్యతలు స్వీకరణ

