నిర్మల్‌లో డాక్టర్ సంతోష్ రాజుపై జరిగిన దాడి ఘటనపై నాగర్ కర్నూల్‌లో వాసవి యువసేన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో వాసవి యువసేన అధ్యక్షుడు చెవ్వ ప్రమోద్, గౌరవ అధ్యక్షుడు డివి నారాయణ మాట్లాడుతూ, విధి నిర్వహణలో ఉన్న వైద్యుడిపై దాడి జరగడం దారుణమని ఖండించారు.
ఈ ఘటనలో పాలుపంచుకున్న నిందితులను వెంటనే అరెస్ట్ చేసి చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. వైద్యులపై దాడులు జరగడం ఆందోళనకరమని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
దాడికి పాల్పడిన వారిపై తక్షణ చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సమాజంలో శాంతి భద్రతలు కాపాడటంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కార్యదర్శి బిల్లకంటి నందు, మలిపెద్ది చంద్రశేఖర్, భాను ప్రకాష్, కిషోర్, సంతోష్, శ్రీ హర్ష తదితరులు పాల్గొన్నారు.: డాక్టర్‌పై దాడి ఘటనపై ఆగ్రహం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *