Category: Telangana News

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తాజా రాజకీయ, పరిపాలనా, అభివృద్ధి, సామాజిక మరియు ప్రజా సమస్యలపై నమ్మకమైన వార్తలు, విశ్లేషణలు మరియు అప్డేట్స్.

నాగర్ కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజా పాలన

నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆర్ట్స్ & కామర్స్ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. గీతాంజలి ఆధ్వర్యంలో అధ్యాపకులు, విద్యార్థులు శ్రమదానంలో పాల్గొన్నారు.

మహిళలను వేధించిన ఇద్దరు ఆకతాయిల అరెస్ట్

నాగర్ కర్నూల్ బస్టాండ్ ఆవరణలో మహిళలను వేధిస్తున్న ఇద్దరు ఆకతాయిలను జిల్లా షీ టీం అరెస్టు చేసింది. మహిళల భద్రతపై కఠిన చర్యలు తీసుకుంటామని షీ టీం ఎస్సై రజిత హెచ్చరించారు.

పాలెం డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పాలెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో ఘనంగా జాతీయ దంత వైద్యుల దినోత్సవం

నాగర్ కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో జాతీయ దంత వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి పాల్గొని దంత వైద్యుల సేవలను కొనియాడారు.

సోమశిల ఐకానిక్ వంతెన నిర్మాణానికి కీలక ముందడుగు

సోమశిల వద్ద కృష్ణా నదిపై ప్రతిష్టాత్మక వంతెన నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. వంతెన నిర్మాణానికి అవసరమైన అటవీ అనుమతులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది.

తెలంగాణ నూతన గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా

తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లాను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌గా ఉన్న జిష్ణు దేవ్ వర్మను మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలు చేయాలి

నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులకు ఆదేశించారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

నాగర్‌కర్నూల్‌లో సమ్మె బాటలో విద్యుత్ స్పాట్ బిల్లర్స్

నాగర్‌కర్నూల్ జిల్లాలో విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న స్పాట్ బిల్లర్స్ సమ్మె కొనసాగుతోంది. పని దినాలు పెంచాలని, కనీస వేతన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి

నాగర్‌కర్నూల్ జిల్లాలో అసంపూర్తిగా మిగిలిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులకు, గుత్తేదారులకు ఆదేశించారు.