నాగర్ కర్నూల్ జిల్లాలో 637 టన్నుల యూరియా నిల్వలు
నాగర్ కర్నూల్ జిల్లాలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 637 టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.
నాగర్కర్నూల్ తాజా వార్తలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజా సమస్యల సమాచారం.
నాగర్ కర్నూల్ జిల్లాలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 637 టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.
డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని సెక్టోరియల్ ఆఫీసర్ వెంకటయ్య అన్నారు. నాగర్ కర్నూల్లో జరిగిన శిక్షణ కార్యక్రమంలో ప్రహరీ క్లబ్ సభ్యులకు అవగాహన కల్పించారు.
నాగర్కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో నో స్మోకింగ్ డే సందర్భంగా విద్యార్థులకు ధూమపానం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్లకార్డుల ద్వారా విద్యార్థులకు ఆరోగ్యంపై ధూమపానం ప్రభావాలను వివరించారు.
లట్టుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున యూనిఫామ్ చీరలను పంపిణీ చేశారు. వైద్యాధికారి డాక్టర్ టి. ప్రసన్న ఆశా కార్యకర్తలకు రెండు చొప్పున చీరలను అందజేశారు.
పొగ త్రాగడం వ్యక్తిగత అలవాటు మాత్రమే కాదు, చుట్టూ ఉన్న వారి ఆరోగ్యానికి కూడా ప్రమాదం. పాసివ్ స్మోకింగ్ వల్ల కుటుంబ సభ్యులు, ముఖ్యంగా పిల్లలు మరియు మహిళలు ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్యకరమైన సమాజం కోసం నో…
సృజనాత్మక ఆలోచనలతో మహిళలు ఆకర్షణీయమైన ఉత్పత్తులు తయారు చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. మెప్మా మహిళా సంఘాల ఆధ్వర్యంలో వ్యర్థ పదార్థాలతో తయారు చేసిన ఉత్పత్తులను కలెక్టర్ ప్రశంసించారు.
నాగర్కర్నూల్ జిల్లాలో ప్రజలకు అందించే త్రాగునీరు పూర్తిగా శుద్ధితో సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. రానున్న వేసవిలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ నూతన గవర్నర్గా శివ ప్రతాప్ శుక్లా లోక్భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఈనెల 13న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మదన్మోహన్ తెలిపారు. దాదాపు 10 కంపెనీలు పాల్గొననున్న ఈ జాబ్ మేళాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.