Category: latest News

NSUI ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ

నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ బాయ్స్ హైస్కూల్‌లో ఎన్ఎస్‌యూఐ నాయకులు పందెం వెంకటేశ్వర్ రెడ్డి, మాదిరెడ్డి మణికంఠ రెడ్డి ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశారు.

మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

నాగర్ కర్నూల్ మున్సిపల్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళా సిబ్బందిని సత్కరించి చీరలను పంపిణీ చేశారు.

పరిశుభ్రతపై నిర్లక్ష్యం: తెల్కపల్లి పిహెచ్‌సీ వైద్యులపై ఆగ్రహం

నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో పరిశుభ్రత లోపాలను గమనించి వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళలను వేధించిన ఇద్దరు ఆకతాయిల అరెస్ట్

నాగర్ కర్నూల్ బస్టాండ్ ఆవరణలో మహిళలను వేధిస్తున్న ఇద్దరు ఆకతాయిలను జిల్లా షీ టీం అరెస్టు చేసింది. మహిళల భద్రతపై కఠిన చర్యలు తీసుకుంటామని షీ టీం ఎస్సై రజిత హెచ్చరించారు.

పాలెం డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పాలెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు RTF చెక్కులు

నాగర్ కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద విడుదలైన RTF చెక్కులను ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో ఘనంగా జాతీయ దంత వైద్యుల దినోత్సవం

నాగర్ కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో జాతీయ దంత వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి పాల్గొని దంత వైద్యుల సేవలను కొనియాడారు.

సోమశిల ఐకానిక్ వంతెన నిర్మాణానికి కీలక ముందడుగు

సోమశిల వద్ద కృష్ణా నదిపై ప్రతిష్టాత్మక వంతెన నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. వంతెన నిర్మాణానికి అవసరమైన అటవీ అనుమతులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది.

తెలంగాణ నూతన గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా

తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లాను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌గా ఉన్న జిష్ణు దేవ్ వర్మను మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.