Tag: Education News

నాగర్‌కర్నూల్‌లో ప్రిజం విద్యాసంస్థ దశాబ్ది వేడుకలు ఘనంగా

నాగర్‌కర్నూల్‌లోని ప్రిజం విద్యాసంస్థ స్థాపనకు పది సంవత్సరాలు పూర్తైన సందర్భంగా దశాబ్ది వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 95 టీంల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో తమ ప్రతిభను ప్రదర్శించారు.

NSUI ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ

నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ బాయ్స్ హైస్కూల్‌లో ఎన్ఎస్‌యూఐ నాయకులు పందెం వెంకటేశ్వర్ రెడ్డి, మాదిరెడ్డి మణికంఠ రెడ్డి ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశారు.

తాడూరు ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ

నాగర్ కర్నూల్ జిల్లా తాడూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మ్యాథమెటిక్స్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్షల నిర్వహణపై అధికారులకు కీలక సూచనలు చేశారు.

పోలీస్ స్టేషన్లకు టెన్త్ ప్రశ్నపత్రాల తరలింపు

నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల కోసం ప్రశ్నపత్రాలను పోలీస్ బందోబస్తు మధ్య ఆయా పోలీస్ స్టేషన్లకు భద్రపరిచారు. జిల్లాలో 60 కేంద్రాల్లో 10,658 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

శాస్త్రీయ విజ్ఞానంతోనే మూఢనమ్మకాలకు చెక్

సైన్స్ దినోత్సవం సందర్భంగా ప్రిజం పాఠశాలలో 55 విజ్ఞాన ప్రదర్శనలు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ టీ. నిరంజన్ తెలిపారు. శాస్త్రీయ అవగాహనతోనే సమాజంలో మూఢనమ్మకాలను తొలగించవచ్చని అన్నారు.

ప్రశాంతంగా మూడవ రోజు ఇంటర్మీడియట్ పరీక్షలు

నాగర్ కర్నూలు జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష మూడవ రోజు ప్రశాంతంగా జరిగింది. మొత్తం 7,163 మంది విద్యార్థుల్లో 6,908 మంది హాజరయ్యారని అధికారులు వెల్లడించారు.

ఇంటర్, టెన్త్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

నాగర్ కర్నూల్ జిల్లాలో ఇంటర్, టెన్త్ పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. 60 కేంద్రాల్లో 25 వేల మందికిపైగా విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, భద్రత, మౌలిక వసతులు, రవాణా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టారు.