విద్యార్థులు రూపొందించిన మరియు ప్రదర్శించిన వివిధ శాస్త్రీయ పరికరాలు ఆకట్టుకున్నాయి. వాటి ఉపయోగాలు, ప్రాముఖ్యతను విద్యార్థులే వివరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు సైన్స్ క్విజ్ పోటీలు నిర్వహించారు. సైన్స్ ఉపాధ్యాయులు హనుమంత్ రెడ్డి, సతీష్ రెడ్డి, నూరుద్దీన్, రాజేశ్వర్ రెడ్డి శాస్త్ర విజ్ఞాన ప్రాముఖ్యతను వివరించారు. సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను తొలగించడంలో సైన్స్ కీలక పాత్ర పోషిస్తుందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పరికరాల ప్రదర్శన

