నాగర్ కర్నూల్…. మునిసిపల్ ఎన్నికలలో 21వ వార్డు నుండి బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పడిగే రవీందర్ ను గెలిపిస్తేనే వాడు అభివృద్ధి చెందుతుందని బిఆర్ఎస్ యువనేత డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి అన్నారు బుధవారం 21వ వార్డులో అభ్యర్థితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా నియోజకవర్గంలో అవినీతి అక్రమాలు రాజ్యమేలుతున్నాయని ఎలాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన రహదారులను మాత్రమే ప్రస్తుతం వేస్తున్నారని అభివృద్ధి సంక్షేమం సమపాళ్లలో సాగాలంటే కారు గుర్తుకు ఓటు వేసి రవీందర్ ను గెలిపించాలని కోరారు. మునిసిపల్ కార్యాలయం పై గులాబీ జెండా ఎగరడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులతోపాటు సీనియర్ నాయకులు అర్థం రవి బీముడు సత్యం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు: కారును గెలిపిస్తేనే అభివృద్ధి… Post navigation హస్తం నుండి కారులోకి నిలదీయండి కాంగ్రెస్ ను ఓడించండి