జనరల్ విభాగంలో మొత్తం 4,537 మంది విద్యార్థులకు కేటాయింపు ఉండగా, అందులో 4,431 మంది హాజరై పరీక్ష రాశారు. 107 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. వొకేషనల్ విభాగంలో 1,384 మందికి కేటాయింపు ఉండగా, 1,332 మంది హాజరై పరీక్షలకు హాజరయ్యారు. 52 మంది గైర్హాజరయ్యారు.
మొత్తంగా చూస్తే, జిల్లాలో 5,921 మంది విద్యార్థులకు కేటాయింపు ఉండగా, 5,763 మంది పరీక్షలకు హాజరయ్యారు. 159 మంది గైర్హాజరైనట్లు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి.పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు, సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించారని అధికారులు పేర్కొన్నారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. తదుపరి పరీక్షలు కూడా ఇదే విధంగా ప్రశాంతంగా నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.: నాల్గవ రోజు 5,763 మంది హాజరు
