పరీక్షా గదులను సందర్శించిన ఆయన, విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాస్తున్నారా అనే అంశాన్ని పరిశీలించారు. తాగునీరు, లైట్లు, ఫ్యాన్లు, మెడికల్ సౌకర్యాలపై అధికారులను ప్రశ్నించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేసి, కంట్రోల్ రూమ్ ద్వారా పరీక్షా గదుల పరిస్థితిని పరిశీలించారు. ప్రశ్నాపత్రాలు నిర్ణీత సమయానికే తెరిచారా? ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను 5 నిమిషాల్లోపు అనుమతించారా? అని సిబ్బందిని ప్రశ్నించారు.
కేంద్రంలో 197 మందికి గాను 193 మంది హాజరయ్యగా, 4 మంది గైర్హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 5968 మందిలో 5806 మంది హాజరై, 107 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా ఇంటర్మీడియట్ అధికారులు పాల్గొన్నారు.: ఇంటర్ పరీక్షలపై ఆకస్మిక తనిఖీ
