Nagarkurnool జిల్లా కేంద్రంలోని చెరువులో నాగనులు గ్రామానికి చెందిన కాశమ్మ అనే మహిళ మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతదేహాన్ని పార్థివ అంబులెన్స్ తరలించాల్సిం ఉండగా, చెత్త తరలించే వాహనంలో తీసుకెళ్లిన తీరు అక్కడున్న వారిని తీవ్రంగా కలచివేసింది.

స్థానికుల కథనం ప్రకారం, చెరువులో మృతదేహం వెలికితీసిన అనంతరం సరైన పార్థివ వాహనం అందుబాటులో లేకపోవడంతో చెత్త బండిని ఉపయోగించాల్సి వచ్చిందని తెలిపారు. ఈ సమయంలో కొందరు సెల్ఫీలు తీసుకుంటూ వ్యవహరించడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

“జీవించి ఉన్నవారికే కాదు, మరణించిన వారికి కూడా గౌరవం ఉండాలి. కనీసం మృతదేహాన్ని అయినా అంబులెన్స్‌లో తరలించాల్సింది,” అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై అధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అలాగే ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో అంబులెన్స్ సౌకర్యాలను మెరుగుపరచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కనీస మానవీయ విలువలు కాపాడే విధంగా వ్యవస్థ మారాలని కోరుతున్నారు.: మానవత్వం మంట కలిసిన ఘటన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *