కమిటీ సభ్యులుగా టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా కార్యదర్శి సురేష్ కుమార్, డైలీ న్యూస్ పేపర్కు చెందిన సీనియర్ జర్నలిస్టు పలుస విజయ్ కుమార్, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధిగా జి. సాయిలు సాగర్, ఫోటో జర్నలిస్టు ప్రతినిధిగా నేతాజీ గౌడ్, మీడియం డైలీ న్యూస్ పేపర్ నుండి ఎం. శ్రీనివాసులు, ఉర్దూ డైలీ న్యూస్ పేపర్ నుండి ముబిన్ అహ్మద్ ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా జిల్లాలోని పత్రికా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమపై విశ్వాసం ఉంచి అక్రిడేషన్ కమిటీకి ఎంపిక చేసినందుకు తెలంగాణ మీడియా అకాడమీకి కృతజ్ఞతలు తెలిపారు. అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ అందేలా పారదర్శకంగా పనిచేస్తామని వారు హామీ ఇచ్చారు.: జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీకి జర్నలిస్టుల ఎంపిక
