విజయ్ దేవరకొండ–రష్మికను కలిసిన కలెక్టర్ బాదావత్ సంతోష్ దంపతులు
నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం తుమ్మన్పేట గ్రామంలో ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ దంపతులు కలసి జ్ఞాపిక అందజేశారు.
నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం తుమ్మన్పేట గ్రామంలో ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ దంపతులు కలసి జ్ఞాపిక అందజేశారు.
ఉప్పునుంతల మండలం మామిళ్ళపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నిర్వహించిన కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల సరిత రాజేష్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టువస్త్రాలు సమర్పించారు.
నాగర్ కర్నూల్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 43 వినతులు అందాయి. ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు.
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం తుమ్మలపేట గ్రామంలో సత్యనారాయణ స్వామి వ్రతంలో సినీ ప్రముఖులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పాల్గొననున్నట్లు సమాచారం. ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభమై 11 గంటలకు ముగియనుంది.
అచ్చంపేట డివిజన్ పరిధిలోని 137 మంది నూతన సర్పంచులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో గ్రామాభివృద్ధి, పారదర్శక పాలన, రాజకీయాలకు అతీతంగా సేవలందించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో చెంచు పెంటల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT)తో ఎంవోయూ కుదుర్చుకోవాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. సమగ్ర సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
అచ్చంపేటలో సబ్ డివిజన్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి పరీక్షా శిబిరంలో 107 మంది డ్రైవర్లు పాల్గొన్నారు. రహదారి భద్రత కోసం కంటి పరీక్షలు అవసరమని అధికారులు సూచించారు.