Category: latest News

ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం

నాగర్‌కర్నూల్‌లో బిఎస్పీ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 373వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శివాజీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని పార్టీ నేతలు తెలిపారు.

శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే

కుమ్మెర గ్రామంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే డా. రాజేశ్ రెడ్డి హాజరై ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

మానవత్వం మంట కలిసిన ఘటన

నాగర్‌కర్నూల్ చెరువులో నాగనోలు గ్రామానికి చెందిన మహిళ మృతి చెందగా, మృతదేహాన్ని చెత్త వాహనంలో తరలించిన ఘటన ప్రజలను కలచివేసింది. అంబులెన్స్ లేమిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

కలెక్టర్ బాదావత్ సంతోష్ ని కలిసిన Indian Red Cross Society జిల్లా నూతన కార్యవర్గం

నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ గారిని రెడ్ క్రాస్ నూతన కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిసింది. రక్తదాన, వైద్య శిబిరాలు, విపత్తు సేవలపై చర్చించి జిల్లా యంత్రాంగ సహకారం కోరారు.

శ్రీపురంలో ఇందిరమ్మ ఇళ్ల ఘన ప్రారంభం

శ్రీపురం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే డా. కుచ్చుకుళ్ల రాజేష్ రెడ్డి గారు ప్రారంభించారు. పేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.

భారత్‌లో మార్పుల వేగం అద్భుతం

భారత్‌లో టెక్నాలజీ అభివృద్ధి వేగం ఆశ్చర్యకరమని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్‌లో 118 దేశాలు పాల్గొన్నాయి.

TNGO 2026 డైరీ ఆవిష్కరణ

నాగర్‌కర్నూల్‌లో టీఎన్జీవో 2026 డైరీని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలపై చర్చించి పరిష్కార హామీ ఇచ్చారు.

ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఫిబ్రవరి 25 నుండి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలకు 34 కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు. లీకేజీలు, అక్రమాలకు తావిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరిక.

భూసేకరణ వేగవంతం చేయాలి

నాగర్‌కర్నూల్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం చేసి నిర్వాసితులకు పూర్తి పునరావాసం కల్పించాలని ఆర్&ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు అధికారులను ఆదేశించారు.