గడువు లోపు లైసెన్స్ తీసుకోని వ్యాపార సంస్థలపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు లైసెన్స్ పొందని దుకాణాలపై 25 శాతం పెనాల్టీ విధించబడుతుందని తెలిపారు. అలాగే జూలై 1 నుంచి లైసెన్స్ తీసుకోని వ్యాపార సంస్థలపై 50 శాతం పెనాల్టీ విధించడమే కాకుండా అవసరమైతే షాపులను సీజ్ చేయడం కూడా జరుగుతుందని స్పష్టం చేశారు.
కావున పట్టణంలోని అన్ని దుకాణ యజమానులు ముందుకు వచ్చి ట్రేడ్ లైసెన్స్ తీసుకొని పట్టణాభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
మరిన్ని వివరాల కోసం తిరుపతయ్య (9550942030) లేదా సతీష్ (9160000647)ను సంప్రదించాలని సూచించారు.: మార్చి 31లోగా ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి


