ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వచ్చే రోగులకు కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ శిబిరంలో రోగులకు సాధారణ కంటి పరీక్షలతో పాటు ప్రత్యేక కంటి పరీక్షలు కూడా చేపట్టనున్నారు. పరీక్షల్లో క్యాటరాక్టు పొర ఉన్నవారిని గుర్తించి, వారికి మహబూబ్నగర్ జిల్లా ఏనుగొండలోని లయన్ రామ్ రెడ్డి కంటి ఆసుపత్రిలో ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు.
అవసరమైన రోగులను ప్రత్యేక అంబులెన్స్ ద్వారా ఏనుగొండకు తరలిస్తారని అధికారులు వివరించారు. శిబిరానికి వచ్చే రోగులు ముందుగానే బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకొని రిపోర్టులను వెంట తీసుకురావాలని సూచించారు.
అలాగే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ లేదా ఏదైనా గుర్తింపు కార్డు జిరాక్స్ కాపీతో పాటు ఫోన్ నెంబర్ తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9440876556, 7386940480 నంబర్లను సంప్రదించవచ్చని చెప్పారు.: 25న ఉచిత కంటి వైద్య శిబిరం
