Category: Kollapur

జిల్లా పోలీస్ కార్యాలయంలో మహిళా అధికారులకు ప్రత్యేక కార్యక్రమం

నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా అధికారులకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఉచిత వైద్య పరీక్షలు, క్రీడా కార్యక్రమాలు నిర్వహించి మహిళా సిబ్బందిని ప్రోత్సహించారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో ఎల్‌పీజీ సిలిండర్లకు కొరత లేదు

నాగర్ కర్నూల్ జిల్లాలో గృహావసరాలు, విద్యాలయాలు, ఆసుపత్రులకు ఎల్‌పీజీ సిలిండర్ల కొరత లేదని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. సాగు, తాగునీటి సమస్యలు కూడా లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

కొల్లాపూర్ సాయి కృప ఆసుపత్రి సీజ్

నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై కఠిన నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. అక్రమ అబార్షన్ల ఆరోపణల నేపథ్యంలో కొల్లాపూర్‌లోని సాయి కృప ఆసుపత్రిని సీజ్ చేశారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో 637 టన్నుల యూరియా నిల్వలు

నాగర్ కర్నూల్ జిల్లాలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 637 టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.

విద్యార్థులు యాంటీ డ్రగ్ సోల్జర్స్‌గా మారాలి

డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని సెక్టోరియల్ ఆఫీసర్ వెంకటయ్య అన్నారు. నాగర్ కర్నూల్‌లో జరిగిన శిక్షణ కార్యక్రమంలో ప్రహరీ క్లబ్ సభ్యులకు అవగాహన కల్పించారు.

🚭 నో స్మోకింగ్ డే: పొగరహిత సమాజం కోసం అవగాహన అవసరం

పొగ త్రాగడం వ్యక్తిగత అలవాటు మాత్రమే కాదు, చుట్టూ ఉన్న వారి ఆరోగ్యానికి కూడా ప్రమాదం. పాసివ్ స్మోకింగ్ వల్ల కుటుంబ సభ్యులు, ముఖ్యంగా పిల్లలు మరియు మహిళలు ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్యకరమైన సమాజం కోసం నో…

మైసమ్మ ఆలయంలో డీఎస్పీ శ్రీనివాసులు ప్రత్యేక పూజలు

పెద్దకొత్తపల్లి మండలం నాయనపల్లి గ్రామంలోని మైసమ్మ ఆలయాన్ని డీఎస్పీ శ్రీనివాసులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు ఆయనను ఘనంగా సన్మానించారు.

నాగర్ కర్నూల్‌లో మైనర్ గర్భధారణ కేసు సంచలనం

నాగర్ కర్నూల్ జిల్లాలో మైనర్ గర్భధారణ కేసు విచారణలో కీలక మలుపు తిరిగి, అసలు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

బాలిక గర్భధారణ కేసు: బాలుడిపై పోక్సో కేసు

నాగర్ కర్నూల్ జిల్లాలో ఇంటర్ విద్యార్థిని స్కానింగ్ కేంద్రంలో ప్రసవించిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి 17 ఏళ్ల బాలుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

కోడేరు కేజీబీవీ ఘటనపై ఎస్ఎఫ్ఐ ఆగ్రహం

నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు కేజీబీవీలో ఇంటర్ విద్యార్థిని ప్రసవించిన ఘటనపై ఎస్ఎఫ్ఐ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, SO ను టర్మినేట్ చేసి సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది.