ఈ కార్యక్రమంలో భాగంగా బాధిత కుటుంబానికి సంఘీభావం తెలుపుతూ ఫోరం నేతలు పలు డిమాండ్లను ముందుంచారు. బాధిత కుటుంబానికి రూ.1 కోటి ఎక్స్రేషియా ప్రకటించాలని, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, ప్రభుత్వ పథకం కింద సొంత ఇల్లు మంజూరు చేయాలని కోరారు. అలాగే నిందితులపై వెంటనే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బీసీలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక బీసీ పరిరక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. స్టేట్ కోఆర్డినేటర్ రిటైర్డ్ లెక్చరర్ ఎం. రామకృష్ణయ్య, ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్లు ఫిజిక్స్ అరుణ్ కుమార్, వల్లూరి శివాచారి తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి తక్షణ న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఫోరం నేతలు డిమాండ్ చేశారు.: కుమ్మెర బాధితులకు సత్వర న్యాయం

